ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సమస్య ఇంకా పూర్తిగా సమసిపోలేదు. కొన్ని రోజుల క్రితం వరకూ దక్షిణ కొరియాలో కరోనా విజృంభించింది.. మళ్లీ యూరప్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ మ్యాగజైన్ లాన్సెట్లో ఒక షాకింగ్ అధ్యయనం ప్రచురితమైంది.
దీని ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల సంఖ్య, వాస్తవ మరణాలతో పోల్చుకుంటే చాలా తక్కువట. 2020 జనవరి నుంచి 2021 డిసెంబరు వరకు ప్రపంచ వ్యాపత్ంగా 59 లక్షల కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే వాస్తవ కరోనా మరణాల సంఖ్య దీనికి మూడు రెట్లు ఉండొచ్చని ఈ అధ్యయనం తెలిపింది.
వాస్తవంగా ఈ సమయంలో కరోనా మరణాల సంఖ్య 18.2 మిలియన్లు (1.82 కోట్లు) అని చెప్పింది. ఒక్క భారతదేశంలోనే 41 లక్షల మంది కరోనా కారణంగా చనిపోయారని వెల్లడించింది. ఇవి ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల సంఖ్యలో 22 శాతం అని పేర్కొంది.