వార్సా: పోలాండ్లో అరుదైన ఘటన చోటుచేసుకొన్నది. క్రాకోవ్ పట్టణంలోని దవాఖానలో ఓ మహిళ ఒకేసారి ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ శిశువులను ప్రస్తుతం వైద్యులు శ్వాసకోశ సపోర్టుపై ఉంచారు. పుట్టిన వారిలో ఇద్దరు మగ పిల్లలు కాగా, ముగ్గురు ఆడ శిశువులు. వీరితో ఆ పోలిష్-బ్రిటిష్ దంపతులు మరో ఐదుగురిని తమ కుటుంబంలోకి ఆహ్వానించారు.
ఐదుగురు పిల్లలకు జన్మనివ్వడం అరుదైన ఘటన అని, 5.2 కోట్ల మందిలో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉన్నదని వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఆ తల్లికి అప్పటికే ఏడుగురు పిల్లలు ఉన్నారు.