Corona Virus | వాషింగ్టన్, మార్చి 30: గర్భధారణ సమయంలో కొవిడ్-19 బారిన పడిన తల్లులకు జన్మించిన పిల్లలు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నట్టు యూఎస్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కొవిడ్ సమయంలో గర్భం దాల్చిన తల్లులకు జన్మించిన 150 మంది శిశువులపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు.
కొవిడ్-19 సోకని 130 మంది తల్లులకు పుట్టిన శిశువులతో పోలిస్తే కరోనా బారినపడ్డ తల్లులకు జన్మించిన శిశువులు తక్కువ బరువుతో పుట్టారని, మొదటి ఏడాదిలో అత్యధికంగా బరువు పెరిగిపోయారని పరిశోధకులు గుర్తించారు. రాబోయే రోజుల్లో వీరికి డయాబెటిస్తోపాటు గుండె సంబంధ వ్యాధులు తప్పవని అంచనా వేశారు.