బీజింగ్/జిషిషాన్, డిసెంబర్ 19: చైనాలో భారీ భూకంపం సంభవించింది. 127 మంది మరణించారు. 700 మందికిపైగా గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి గాన్సూ, కిన్ఘై రాష్ర్టాల్లో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది.
గాన్సూ రాష్ట్రంలోనే 113 మంది మరణించగా, కిన్ఘై రాష్ట్రంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 1.5లక్షలకుపైగా ఇండ్లు దెబ్బతిన్నాయి. పసుపు నదిపై నిర్మించిన బ్రిడ్జీకి పగుళ్లు వచ్చాయి. రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయ చర్యలు చేపడుతున్నారు.