వాషింగ్టన్: ఇరాన్ (Iran) మద్దతుతో సిరియాలో (Syria) కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాయుధ బలగాలపై అమెరికా మరోసారి వైమానిక దాడులు (US Strikes) జరిపింది. దీంతో తొమ్మిది మంది మరణించారు. సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మద్దతున్న సాయుధ బలగాలు గొత కొన్ని రోజుల్లో 12 సార్లు దాడిచేశాయి. ఈ నేపథ్యంలోనే వారి ఆయుధాగారంపై తమ యుద్ధ విమానాలు (US warplanes) కాల్పులు జరిపినట్లు యూఎస్ రక్షణ మత్రి లాయిడ్ ఆస్టిన్ (Lloyed Austin) తెలిపారు. అమెరికా దళాలపై దాడులను ఏమాత్రం సహించబోమని చెప్పేందుకే ఈ చర్యను చేపట్టినట్లు వెల్లడించారు. ఈ దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉందని, వాటిని చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కాగా, అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ను (MQ-9 Reaper drone) యెమెన్లోని (Yemen) హౌతీ తిరుగుబాటుదారులు (Huthi rebels) కూల్చేశారు. తమ భూభాగంపై నిఘాపెట్టి గూఢచర్యానికి (Spying) పాల్పడుతున్న అమెరికా డ్రోన్ను యెమెన్ తీసరంలో తమ బలగాలు కూల్చేశాయని హౌతీ వెల్లడించారు. ఈ దాడిని అమెరికా కూడా నిర్ధారించింది. ఇజ్రాయెల్కు (Israel) మిలటరీ సహాయంలో భాగంగానే తమపై డ్రోన్లతో అగ్రరాజ్యం నిఘాపెట్టిందని ఆరోపిస్తున్నది.