లాగోస్: నైజీరియాలో (Nigeria) ఘోర పడవ ప్రమాదం జరిగింది. నైగర్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో బగ్బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది. దీంతో 76 మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 85 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారికోసం గాలిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 76 మృతదేహాలను వెలికితీశామని వెల్లడించారు.
ఈ నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పడవలోని ప్రతిఒక్కరి ఆచూకీ లభించేవరకు సహాయక చర్యలు కొనసాగిస్తామని చెప్పారు. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.