బీజింగ్ : చైనా సిచువాన్లో సోమవారం సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. ప్రకృతి ప్రకోపానికి 46 మంది ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.8తో ప్రకంపనలు వచ్చాయి. చాలాచోట్ల భవనాలు భవనాలు కూలిపోగా.. పలుచోట్ల చిక్కుకున్న 50వేలమందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిచువాన్లో 6500 రెస్క్యూ టీమ్లను, నాలుగు హెలికాప్టర్లను మోహరించారు.
దీంతో పాటు 1,100 అగ్నిమాపక దళ బృందాలను రంగంలోకి దింపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ 50 మిలియన్ యువాన్లను రెస్క్యూ, రిలీఫ్ ఫండ్ను విడుదల చేసింది. ప్రాంతీయ ప్రభుత్వం కూడా గంజికి 50 మిలియన్ యువాన్లను కేటాయించింది. భూకంపం కేంద్రంగా ఉన్న లూడింగ్ కౌంటీకి సహా సహాయక సామగ్రిని కేటాయించారు. 2008లో చైనాలో 8.2 తీవ్రతతో భూకంపం సంభవించగా.. 69వేలమందికిపైగా మృత్యువాతపడ్డారు. 18వేల మందికిపైగా మరణించారు.