జకార్తా: ఇండోనేసియాలోని ఓ జైలులో తలెత్తిన భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో 41 మంది ఖైదీలు మరణించగా, మరో 80 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున జకార్తా శివార్లలోని టాంగెరాంగ్ జైలులోని సీ బ్లాక్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది చనిపోయారని న్యాయశాఖ అధికారప్రతినిధి రికా అప్రియాంతి తెలిపారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. వందల మంది పోలీసులు, సైనికులు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పినట్లు తెలిపారు. బాధితులను ఆస్పత్రికి తరలించామన్నారు.
టాంగెరాంగ్ జైలులో డ్రగ్స్ కేసులో శిక్షలు పడినవారిని ఉంచుతారు. జైలులో మొత్తం 1225 మంది ఖైదీలను మాత్రమే ఉంచవచ్చు. అయితే ఇందులో రెండు వేలకుపైగా ఖైదీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదం సమయంలో సీ బ్లాక్లో 122 మంది దోషులు ఉన్నారని చెప్పారు.