China | బీజింగ్ : చైనాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జియాంగ్జిలోని సెంట్రల్ చైనీస్ ప్రావిన్స్లో సంభవించిన అగ్నిప్రమాదంలో 39 మంది మృతి చెందారు. మరో 9 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం 3:24 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఓ స్టోర్లోషాపింగ్ కాంప్లెక్స్లోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. అగ్నిప్రమాద ఘటన నుంచి 120 మందిని ప్రాణాలతో కాపాడినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు.
ఐదు రోజుల క్రితం సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. పాఠశాలలో జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు.