ఢాకా: బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్లో (Chittagong) ఘోర అగ్రిప్రమాదం జరిగింది. చిట్టగాంగ్లోని కాదమ్రసుల్ ప్రాంతంలోని కంటైనర్ డిపోలో అర్ధరాత్రి పేలుడు సంభవించింది. దీంతో డిపోలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 35 మంది మరణించారు. వారిలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. మరో 450 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
బీఎం కంటైనర్ డిపోలోని లోడింగ్ పాయింట్లో శనివారం రాత్రి 9 గంటల సమయంలో మంటలు అంటుకున్నాయి. కంటైనర్ డిపోలో కెమికల్స్ ఉండటంతో మంటలు వేగంగా విస్తరించాయి. దీంతో రాత్రి 11.45 గంటల సమయంలో డిపోలో భారీ పేలుడు సంభవించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు వెల్లడించారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఫైర్ సిబ్బంది కూడా మరణించారని తెలిపారు.