ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని తౌన్సా నగరంలో ఓ ప్రభుత్వ దవాఖానలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 331 మంది పిల్లలకు హెచ్ఐవీ సోకిందని బీబీసీ దర్యాప్తులో తేలింది. నవంబర్ 2024-అక్టోబర్ 2025 మధ్య కాలంలో ఈ వైరస్ వ్యాప్తి చెందినట్టు తెలిపింది. సురక్షితం కాని సూదులు వాడటం, సిరంజీలు, వయల్స్ వాడినవే వాడటం వల్ల హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందినట్టు వెల్లడించింది.
ఒకే వయల్లోని మందును పలువురు చిన్నారులకు ఎక్కించారని వివరించింది. సిరంజీని మార్చకుండా వాడినప్పుడు హెచ్ఐవీ సంక్రమించే అవకాశం ఉందని.. ఇది ప్రమాదకరమని నిపుణులు తెలిపారు. ఇంజెక్షన్లను వేడి నీళ్లలో శుభ్రపరచకుండా వాడినట్టు దర్యాప్తులో తేలింది.
8 ఏండ్ల మొహమ్మద్ అమిన్ అనే పిల్లాడు చనిపోవడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే దవాఖాన అధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. బీబీసీ ఫుటేజీ పాతది లేదా బూటకమైనది కావొచ్చన్నారు. తాము సరైన నియమావళిని పాటిస్తున్నామన్నారు.