ఇస్లామాబాద్, సెప్టెంబర్ 1: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్లో ఇంధన ధరలు ఆకాశన్నంటాయి. తాజా పెంపుతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్, డీజిల్ రెండూ రూ.300 మార్కును దాటేశాయి. పెట్రోల్పై రూ.14.91, హైస్పీడ్ డీజిల్పై రూ.18.44 పెంచుతున్నట్టు ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. దీంతో పాకిస్థాన్లో లీటర్ పెట్రోల్ ధర రూ.305.36, డీజిల్ రూ.311.84కి చేరింది. అంతర్జాతీయంగా పెరిగిన ధరలు, ఎక్సేంజీ రేటులో మార్పుల కారణంగా తాజా పెంపుదల చేపట్టినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొన్నది.