ఇస్లామాబాద్, జూలై 4: బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పాకిస్థాన్కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. తాజాగా బలోచిస్థాన్లోని జివానీలో గల పాకిస్థాన్ కోస్ట్గార్డ్ శిబిరంపై ఆత్మాహుతి దాడి జరిపినట్టు ప్రకటించింది. ఈ ఘటనలో 30 మంది పాక్ జవాన్లు మరణించినట్టు పేర్కొన్నది. తమ ఫైటర్స్ శిబిరంలోకి చొరబడి, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని బీఎల్ఏ ప్రతినిధి మీడియాకు తెలిపారు. అయితే ఈ ఘటనలో మృతులకు సంబంధించి పాకిస్థాన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, తమ ప్రాంతంలోని సహజవనరులపై తమకే నియంత్రణ ఉండాలని బలోచిస్థాన్ ప్రావిన్స్లోని వేర్పాటువాద గ్రూప్ బీఎల్ఏ దశాబ్ధాలుగా డిమాండ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో తరుచూ సైనిక, పారామిలిటరీ, ఇతర ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నది. దీనిని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.