టెహ్రాన్: ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపునకు చేరుకోవడంతో హొర్ముజ్ వద్ద ఉద్రిక్తతలు తగ్గుతున్నాయి. జలసంధి నుంచి నౌకల రాకపోకలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు భారత్కు చెందిన 30 నౌకలు విజయవంతంగా హొర్ముజ్ను దాటాయి.
ఇంకో 26 నౌకలు హొర్ముజ్ దాటడానికి రెడీగా ఉన్నాయని భారత షిప్పింగ్ శాఖ వెల్లడించింది. ఇందులో సగం నౌకలు ఎల్పీజీ, ఎల్ఎన్జీ గ్యాస్లను, ఏడు నౌకలు చమురును, 8 నౌకలు బల్క్ కార్గోలను తీసుకొస్తున్నాయి. మార్చి 1 నుంచి జూన్ 17వరకు కేవలం 19 భారత నౌకలే హొర్ముజ్ను దాటాయని.. ఇరాన్-అమెరికా ఒప్పందంతో ఇప్పుడు మరో 11 నౌకలు కేవలం వారంలోపే దాటాయని అధికారులు చెబుతున్నాయి.