మనీలా, డిసెంబర్ 28: భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం అవుతున్నది. క్రిస్మస్ వారాంతం వరకు సంభవించిన వరదలకు 29 మంది మరణించగా.. మరో 25 మంది ఆచూకీ దొరకడం లేదని బుధవారం జాతీయ విపత్తు నివారణ సంస్థ పేర్కొన్నది.
86 వేల మంది షెల్టర్లలో ఉన్నారు. ఫిలిప్పీన్స్లోని ఈశాన్య, మధ్య, నైరుతీ ప్రాంతాల్లో వరదల తీవ్రత ఎక్కువగా ఉన్నది. ఫిలిప్పీన్స్ ఈశాన్య ప్రాంతంలోని మిందానాలో 18 మంది, ఈశాన్య విసయాస్ ప్రాంతంలో 11 మంది మరణించినట్లు జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థ అధికారులు చెబుతున్నారు. 3వేల ఇండ్లు ధ్వంసం కాగా.. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి.