ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎవ్వరి చేతిలో చూసినా దర్శనమిస్తున్న సాంకేతిక విప్లవం.. మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చి ఇవ్వాల్టికి సరిగ్గా 26 ఏండ్లు పూర్తయ్యాయి. తొలి ఫోన్ కాల్ను కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి సుఖ్రామ్తో సరిగ్గా ఇదే రోజున పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జోతి బసు మాట్లాడారు. 1995 లో కోల్కతాలోని రాయిటర్స్ కార్యాలయంలో తొలి ఫోన్ను నెలకొల్పారు. కొన్ని ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన మొబైల్స్.. దినదినం మార్పులు చేర్పులు చేసుకుంటూ స్మార్ట్ ఫోన్ స్థాయికి చేరుకున్నది. ఈ విప్లవంలో ఎన్నో రకాల మొబైల్ ఫోన్లను మనం చూశాం.. వాడాం.
మొబైల్ టెక్నాలజీలో మార్పులు 1980 నుంచి మెల్లగా ప్రారంభమయ్యాయి. బీకే మోదీ అనే పారిశ్రామికవేత్త నెలకొల్పిన మోదీ కార్పొరేషన్ మొబైల్ ఫోన్లలో కొత్త రకం టెక్నాలజీని ప్రజలకు అందుబాటులో తీసుకురావడంలో విశేషంగా కృషిచేసింది. 1993 లో ఆస్ట్రేలియాకు చెందిన టెల్స్ట్రా అనే కంపెనీతో భాగస్వామిగా మారిన మోదీ కార్పొరేషన్.. మోదీ టెల్స్ట్రా కంపెనీగా రూపాంతరం చెందింది. భారతదేశంలో సెల్యులార్ సర్వీసులు ప్రారంభించిన తొలి సంస్థగా ఈ సంస్థ నిలిచింది. వీరి పనితీరును గమనించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు.. బీకే మోదీని కలుసుకుని కోల్కతాలో మొబైల్ నెట్వర్క్ను ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దాంతో కోల్కతాలో కమ్యూనికేషన్ల వ్యవస్థ ఊపందుకున్నది.
అయితే, ఇందుకు తగినట్లుగా మొబైల్ ఫోన్ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన బీకే మోదీ.. అక్కడ టెల్స్ట్రా కంపెనీ సూచనలతో నోకియాతో చర్చలు జరిపారు. దాంతో నోకియా టెక్నాలజీని అందివ్వడానికి ముందుకు రావడంతో మొబైల్ ఫోన్లు మార్కె్ట్ను ముంచెత్తాయి. అప్పట్లో మొబైల్ కాల్ రేట్ నిమిషానికి రూ.16.80, రిసీవింగ్కు రూ.8.40 గా ఉండటంతో మొబైల్ ఫోన్లను వాడేందుకు ప్రజలు ముందుకు రాలేదు. దాంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి తర్వాతి రోజుల్లో కాల్ రేట్లను తగ్గించడంతో మొబైల్ విప్లవానికి నాందీ పలికినట్లయింది.
2006: క్యూబా అధ్యక్ష బాధ్యతలను సోదరుడు రౌల్ కాస్ట్రోకు అప్పగించిన ఫిడెల్ కాస్ట్రో
1993: భారతదేశంలో మొట్టమొదటి తేలియాడే సముద్ర మ్యూజియం కోల్కతాలో ప్రారంభం
1980: ప్రసిద్ధ గాయకుడు మహమ్మద్ రఫీ మరణం
1940: జలియన్వాలాబాగ్ ప్రతీకారం తీర్చుకునేందుకు బ్రిటన్ వెళ్లి మరణించిన ఉద్ధమ్ సింగ్
1658 : మొఘల్ సామ్రాజ్యం సుల్తాన్గా ప్రకటించుకున్న ఔరంగజేబు
1498: తన మూడవ ప్రయాణంలో ‘ట్రినిడాడ్’ ద్వీపానికి చేరుకున్న క్రిస్టోఫర్ కొలంబస్
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
మొబైల్ వాడకంలో మనకు మూడో స్థానం
ఆఫ్ఘాన్లో 6 నెలల్లో 1659 మంది మృతి : యూఎన్ నివేదిక
ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నుంచి ఒలింపిక్స్ మెడల్స్
రెండు కంపెనీల మధ్య టెక్నాలజీ వివాదం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..