Accident | ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి (Bus Loses Control) చెట్టును ఢీ కొట్టడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన థాయ్లాండ్ (Thailand)లో చోటు చేసుకుంది.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలోని పశ్చిమ ప్రావిన్స్ ప్రచువాప్ ఖిరీ ఖాన్ (province of Prachuap Khiri Khan)లో గత అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ (Hits Tree) కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో 14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read..
Khalistani Terrorist | పాక్లో ఖలిస్థానీ ఉగ్రవాది రోడే మృతి
Chennai Airport | కాస్త శాంతించిన వరుణుడు.. చెన్నైలో విమాన సర్వీసులు పునరుద్ధరణ
Telangana | సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఖర్గే కీలక ప్రకటన