Volcano Eruption | ఇండోనేషియా (Indonesia)లోని పశ్చిమ ప్రాంతంలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. సుమత్రా (Sumatra) దీవిలో మౌంట్ మరపి (Mount Merapi)లో ఉన్న అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. మరో 12 మంది ఆచూకీ గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో.. బూడిద ఆకాశంలో మూడు వేల మీటర్ల ఎత్తుకు వ్యాపించింది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్య్కూ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అగ్ని పర్వతం విస్ఫోటనం (volcano eruption) జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో మొత్తం 75 మంది పర్వతారోహకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో 11 మంది మరణించినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ 49 మందికి కాపాడామని.. మరో 12 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని వివరించారు. ప్రస్తుతం గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఘటన తీవ్రత నేపథ్యంలో మౌంట్ మరపి ప్రాంతంలో అధికారులు అలర్ట్ ప్రకటించారు. అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Also Read..
Saja Seat | ఏడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేను ఓడించి.. చరిత్ర సృష్టించిన రోజూవారీ కూలీ
Cyclone Michaung | చెన్నై రోడ్లపై మొసలి ప్రత్యక్షం.. వీడియో వైరల్
Cyclone Michaung | భారీ వర్షాలకు చెన్నైలో ఇద్దరు మృతి.. విమాన సర్వీసులు రద్దు