న్యూఢిల్లీ, జూన్ 10: అఫ్ఘానిస్థాన్పై పాకిస్థాన్ సైనిక దళాలు జరిపిన దాడుల్లో 11 మంది చిన్నారులు సహా 13 మంది నిద్రలోనే మరణించారని, మరో 14 మంది గాయపడ్డారని కాబుల్లోని తాలిబన్ ప్రభుత్వం బుధవారం ఆరోపించింది. ఈ దాడులపై పాకిస్థాన్ నుంచి ఎటువంటి ధృవీకరణ రాలేదు. పాక్ చర్యను దురాక్రమణగా ముజాహిద్ అబివర్ణించింది.