న్యూఢిల్లీ, జూన్ 10: అఫ్ఘానిస్థాన్పై పాకిస్థాన్ సైనిక దళాలు జరిపిన దాడుల్లో 11 మంది చిన్నారులు సహా 13 మంది నిద్రలోనే మరణించారని, మరో 14 మంది గాయపడ్డారని కాబుల్లోని తాలిబన్ ప్రభుత్వం బుధవారం ఆరోపించింది. ఈ దాడులపై పాకిస్థాన్ నుంచి ఎటువంటి ధృవీకరణ రాలేదు. పాక్ చర్యను దురాక్రమణగా ముజాహిద్ అబివర్ణించింది.
పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్
పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్లో బుధవారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లోని వ్యక్తులందరూ మరణించినట్టు ఆర్మీ తెలిపింది. హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా సాంకేతిక సమస్యతో కూలిపోయినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో పైలట్ సహా, 20 మంది సైనికులు మృతి చెందినట్టు పాక్ మీడియా కథనాలు తెలియజేశాయి. రెండు రోజుల వ్యవధిలో బలూచిస్థాన్లో రెండు హెలికాప్టర్లు కూలిపోవడం గమనార్హం.