డమాస్కస్ : సిరియాలోని హోమ్స్ ప్రావిన్స్లో ఉన్న మిలిటరీ కాలేజ్పై శుక్రవారం ఉదయం డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా, 240 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు బాలలు ఉన్నారు.
గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరుగుతుండగా ఈ దాడి జరిగింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ ఈ దారుణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.