నార్త్ వజీరిస్తాన్: పాకిస్థాన్లోని నార్త్ వజీరిస్తాన్ గిరిజన జిల్లాలో భద్రతా దళాల కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో పది మంది సెక్యూర్టీ సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం జరిగింది. మిరాలీ నుంచి మిరాంషా వైపు కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఈ అటాక్ జరిగింది. మోటార్సైకిల్పై వచ్చిన సూసైడ్ బాంబర్.. సెక్యూర్టీ దళంలోని వాహనంపై వెళ్లి పేల్చుకున్నాడు. మిరాలీలోని ఖాదీ మార్కెట్ వద్ద ఈ అటాక్ జరిగింది. గాయపడ్డవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.