మహేశ్వరం, జూన్ 21: ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం శివగంగ దేవాలయంలో ఆధ్యాత్మిక దినోత్సవం, ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ రఘుమారెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి.. భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికతకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు. తెలంగాణలో అతిపెద్ద దేవాలయం యాదాద్రిని అతి సుందరంగా తీర్చిదిద్ది గుర్తింపు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. సీఎం కేసీఆర్ యజ్ఞాలు, యాగాలు చేసి తెలంగాణను సస్యశ్యామలంగా మారుస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతాఆంధ్యానాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్రెడ్డి, సర్పంచ్ కరోళ్ల ప్రియాంకారాజేశ్, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్, నియోజకవర్గం కార్యదర్శి గుండెమోని అంజయ్య ముదిరాజ్, రైతుబంధు చైర్మన్ రాఘవేందర్రెడ్డి, ఎంపీడీవో నర్సింహులు, సర్పంచ్లు శివిరాజునాయక్, ముక్కెర యాదయ్య ఎపీటీసీలు సువర్ణారాంరెడ్డి, కుమారి రాయప్ప, నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, నవీన్, బండారు లింగం, ఉపసర్పంచ్ నర్సింగ్పటేల్, ఎస్కే ఆజాం, దుడ్డు కృష్ణ, రవీందర్నాయక్, దిద్దెల అశోక్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఖిల్లా మైసమ్మ ఆలయంలో..
ఆర్కేపురం, జూన్ 21 : ఆధ్యాత్మిక దినోత్సవంలో భాగంగా ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ ఆలయంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నాగేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్శర్మ, ఆయల చైర్మన్ గొడుగు శ్రీనివాస్, ఎంఏ.సాజీద్, ముప్పిడి లింగస్వామిగౌడ్, మురళీధర్రెడ్డి, సిద్దగోని వెంకటేశ్గౌడ్, దేవాలయ కార్యనిర్వహణాధికారి వి.సుబ్రహ్మణ్యం, జూనియర్ అసిస్టెంట్ గొడిసె శ్రీకాంత్గౌడ్, శ్రీరాములు, వనం వేణు, శ్రీకాంత్, రమేశ్ పాల్గొన్నారు.
కులమతాలకతీతంగా అభివృద్ధి
కందుకూరు, జూన్ 21 : కులమతాలకతీతంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలను ప్రభుత్వం అభివృద్ధి చేసిందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని గూడూరు దేవాలయంలో పూజలు, మసీదులో ప్రార్థనలు, బాచుపల్లి గ్రామంలోని చర్చిలో ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, ఆయా గ్రామాల సర్పంచ్లు శ్రీలతాశ్రీహరి, యాలాల శ్రీనివాస్, కాకి దశరథ ముదిరాజ్, సర్పంచ్ ఇండిరమ్మ, ఎంపీటీసీలు సురేశ్, కాకి రాములు, లచ్చానాయక్, డైరెక్టర్ పొట్టి ఆనంద్, నర్సింహ, ఆనేగౌని దామోదర్గౌడ్, ఆనేగౌని పాండుగౌడ్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు అలీ, బాలమల్లేశ్, గొర్రెంకల రామకృష్ణ, హన్మంత్ యాదవ్, రాజు షకీల్, హనీఫ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.