హైదరాబాద్: హైదరాబాద్లోని పాతబస్తీలో లూడో ఆట ఓ యువకుడి ప్రాణం తీసింది. పాతబస్తీలోని మంగళ్హాట్ పరిధిలో ఉన్న గుప్పానగర్లో ఈ దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారు జామున హనీఫ్, హాజీ అనే ఇద్దరు వ్యక్తులు లూడో ఆట ఆడుతున్నారు. ఈ క్రమంలో డబ్బు విషయమై ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అది చిలికి చిలికి పెద్దదిగా మారింది. దీంతో ఇద్దరు ఒకరిపై ఒకరు పరస్పరం దాడిచేసుకున్నారు. ఇందులో హనీఫ్ అక్కడికక్కడే మృతిచెందాడు. హాజీ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.