Kacheguda | కాచిగూడ, జూన్ 5 : పట్టాల పక్కన నడుచుకుంటూ వెళుతుండగా రైలు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని యువకుడు(25) గురువారం ఉదయం జూకల్ – ఉందానగర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కాచిగూడ రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదే హాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుని వంటిపై ఆకుపచ్చ రంగు చొక్కా,నీలి రంగు ప్యాంటు ధరించి, ఎత్తు 5.5 ఉన్నట్లు తెలిపారు. మృతుని వివరాల కోసం 9948695948 లో సంప్రదించాలని హెచ్.సి సమ్మయ్య కోరారు.