సుల్తాన్బజార్, మార్చి 7: శివాజీ వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇన్స్పెక్టర్ మోహన్రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉస్మాన్షాహి ప్రాంతానికి చెందిన ఈశ్వర్ సింగ్ ప్రైవేట్ ఉద్యోగి. శనివారం ఉదయం ఉస్మాన్షాహి నుంచి ఇమ్లిబన్ పార్క్ వైపు రోడ్డు దాటుతుండగా ఉస్మాన్షాహి శివాజీ వంతెన సిగ్నల్ వద్ద పరిగి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతివేగంగా పాదచారిని వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారంతో తెలు సుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ నాగేశ్వర్ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.