హైదరాబాద్ : తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశతో ఆన్లైన్లో బెట్టింగ్ను(Online betting) ఎంచుకున్నాడు. బెట్టింగ్కు కావాల్సిన డబ్బులను అప్పులు చేయగా, తిరిగి రాకపోవడంతో పూర్తిగా నష్టపోయిన ఓ బాధితుడు ఇంట్లో ఉరి వేసుకొని(Hanging) ఆత్మహత్య(Committed suicide) చేసుకున్న సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి(Gundlapochampally) ప్రాంతానికి చెందిన విజయ్కుమార్రెడ్డి(35) ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటుపడ్డాడు. దానికి కావాల్సిన డబ్బులు తెలిసిన వారి వద్ద అప్పులు చేసి ఆన్లైన్లో పెట్టడంతో తిరిగి రాలేదు. దీంతో మనస్థాపానికి గురైన విజయ్ తన ఇంట్లో బెడ్రూంకు గడియ పెట్టుకొని ఫ్యాన్కు నైలాన్ తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.