హైదరాబాద్ : ఎర్రగడ్డ భరత్నగర్ ఫ్లైఓవర్(Bharatnagar flyover) పై ఘోర ప్రమాదం(Road accifent) చోటు చేసుకుంది. స్కూటీ పై వెళ్తున్న యువతిని వెనుక నుంచి వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఓ యువతి మృతి చెందింది(Woman dies). వివరాల్లోకి వెళ్తే.. స్కూటీపై వెళ్తున్న ఓ యువతిని వాటర్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీ కొట్టింది.
ఇదే సమయంలో ఆర్టీసీ బస్సు ఆమె మీద నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన యువతిని ఏపీకి చెందిన సునీతగా గుర్తించారు. నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ఎర్రగడ్డ నుంచి కూకట్పల్లి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.