బంజారాహిల్స్, మార్చి 22: గంజాయి తాగొద్దంటూ మందలించిన వ్యవహారంలో స్నేహితుల మధ్య చోటు చేసుకున్న గొడవలో ఛాతీపై కొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని గౌరీశంకర్ కాలనీలో నివాసం ఉంటున్న రఘువీర్ రాయ్ (19) అనే యువకుడు పదో తరగతి చదువుతూ మధ్యలో ఆపేశాడు. స్థానికంగా నివాసం ఉంటున్న పింటూ(17) సాయి సూ ర్య, అక్షయ్కుమార్ స్నేహితులు.
గత కొంతకాలంగా సాయిసూర్య(19), అక్షయ్కుమార్(19)లతో కలిసి రఘువీర్ రాయ్ గంజా యి తాగుతూ ఆవారాగా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి రోడ్ నెం 7లోని పార్కులో రఘువీర్ రాయ్తో పా టు అతడి స్నేహితులు కలిసి గ ంజాయి సేవిస్తున్నారని గుర్తించిన పింటూ అక్కడకు వచ్చా డు. రఘువీర్ను తీవ్రంగా మం దలించడంతో గొడవ ప్రారంభమైంది. ఈ గొడవలో భాగంగా పింటూ కోపంతో రఘువీర్పై తలతో పాటు ఛాతీపై కొట్టడంతో ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి కుప్పకూలడంతో పాటు అక్కడిక్కడే మృతి చెందాడు.
ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు పింటూ, సాయిసూర్య, అక్షయ్కుమార్తో పాటు మరో బాలుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా సాయిసూర్య, అక్షయ్కుమార్లపై గతంలో సైతం కేసులున్నాయని పోలీసుల విచారణలో తేలింది.