వనస్థలిపురం, ఆగస్టు 31 ః రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మంచాల మండలం ఆరుట్లకు చెందిన చీమర్ల వంశీ(20) తన స్నేహితుడు బడే ప్రవీణ్తో కలిసి తన ఎఫ్జెడ్ బైక్పై ఆదివారం తెల్లవారుజామున 3గంటలకు ఇబ్రహీంపట్నం నుంచి బీఎన్రెడ్డినగర్కు వచ్చారు.
అక్కడ టిఫిన్ చేసి తిరిగి వెళ్తుండగా బీఎన్రెడ్డినగర్ లైఫ్కేర్ దవాఖాన వద్ద తమ ముందు వెళ్తున్న డీసీఎం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో వంశీ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న ప్రవీణ్కు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.