సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ప్రపంచ వికలాంగుల సంక్షేమ దినాన్ని పురస్కరించుకొని శుక్రవారం అంబేద్కర్ దూరవిద్యా కేంద్రంలోని వీ హబ్లో ఉపాధిపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా దివ్యాంగులతో సీఈఓ దీప్తీ రావుల సమావేశమయ్యారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ… పట్టుదల, ప్రోత్సాహం ఉంటే అంగవైకల్యం అడ్డు కాదని మహిళలు గుర్తించాలని కోరారు. నెట్ వర్క్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ (ఎన్పీడీ) వ్యవస్థాపకుడు ఎం.శ్రీనివాసులు, కార్యదర్శి కొప్పుల వసుంధరతో పాటు మహిళా దివ్యాంగులు పాల్గొన్నారు.