ఉప్పల్, డిసెంబర్ 27 : ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిపేవిధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. మంగళవా రం ఉప్పల్లోని సాయిరాంకాలనీలో రూ.30లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేపడుతున్నామని చెప్పారు.
కాలనీలలోని సమస్యలు పరిష్కరించడంతోపాటు, పనులను సత్వరం పూర్తిచేసేవిధంగా చూస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నామని చెప్పారు. సమస్యలను తనదృష్టికి తీసుకువస్తే.. వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రజితాపరమేశ్వర్రెడ్డి, ఈఈ నాగేందర్, డీఈ నిఖిల్ రెడ్డి, జలమండలి మేనేజర్ సంతోష్కుమార్, మేనేజర్ సత్యనారాయణ, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, ఉప్పల్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, కార్యదర్శి మస్క సుధాకర్, నేతలు యాదగిరిరెడ్డి, వంశీ ముదిరాజ్, వేముల వెంకట్రెడ్డి, గుర్రాల వెంకటేశ్వర్రెడ్డి, శ్రీకాంత్, గొరిగె ఐలేశ్, కాలనీ అధ్యక్షుడు తుమ్మల రాజేందర్రెడ్డి, వర్కాల మదన్, దేవిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.