సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): “వేధింపులపై మౌనంగా ఉండొద్దు.. మీ కోసం షీ టీమ్స్ పనిచేస్తుందని” హైదరాబాద్ నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ మహిళలకు సూచించారు. నవంబర్ నెలలో షీ టీమ్స్కు 103 ఫిర్యాదులు వచ్చాయని.. ఇందులో 52 మంది నేరుగా షీ టీమ్స్ను ఆశ్రయించగా, 34 మంది వాట్సాప్, మిగతా వారు ఇతర సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారని వెల్లడించారు.
ఇందులో 12 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా.. 26 పెట్టీ కేసులు, మిగతా వాటిలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలిపారు.