నేరేడ్మెట్, జూన్2: పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఏ.నర్సింహస్వామి కథనం ప్రకారం.. వినాయక్నగర్ డివిజన్ శ్రీసాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీ సునీల్రాజ్,సీమరాజ్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు పెద్దబాబు పేరు ప్రేంరాజ్ ,ప్రతిక్ ఉన్నారు.
భర్త రోజూ మాదిరిగానే ఇంటినుంచి పనికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. భర్త వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.