హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్గూడలో విషాదం చోటు చేసుకుంది. వివాహిత నాగలతా రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. సుధీర్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని ఆమె సూసైడ్నోట్లో పేర్కొన్నది.
నాగలతారెడ్డికి కొన్నేండ్ల క్రితం వివాహం కాగా, భర్తకు దూరంగా ఉంటుంది. సుధీర్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ మధ్యకాలంలో అతను కూడా ఆమెతో బంధాలు తెంచుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు హైదర్గూడలో ఆత్మహత్య చేసుకుంది. సుధీర్ తనను మోసం చేశాడని సూసైడ్ నోట్లో నాగలతా రెడ్డి పేర్కొన్నది. ఈ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.