హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన నగరంలోని నాంపల్లి స్టేషన్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. యాడి బాయ్ (55) అనే మహిళ రోడ్డు దాతుండగా అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
పోలీసులు కేసు నమోదు చేసుకిని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పంచనామా కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు.