మాదాపూర్, సెప్టెంబర్ 28: మానసిక సమస్యలతో ఓ యువతి కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్కు చెందిన స్వప్న (23)కు ఏడాది కిందట వివాహం జరిగింది. 8 నెలల కిందట విడాకులు తీసుకుంది. మానసిక సమస్యతో బాధపడుతూ మధ్యాహ్నం సమయంలో మాదాపూర్కు వచ్చింది.
3.30 గంటల సమయంలో కేబుల్ బ్రిడ్జి వద్దకు చేరుకుంది. ఆమె వెంట తీసుకొచ్చిన బ్యాగుతో పాటు ఆమె ధరించిన చెప్పులను కేబుల్ బ్రిడ్జి వద్ద విడిచిపెట్టి.. దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అక్కడకు వచ్చిన లేక్ పోలీసులు బ్యాగును గమనించారు. అనుమానంతో బ్యాగును తెరిచి చూడగా అందులో ఆమె సోదరి ఫోన్ నంబర్ ఉంది. పోలీసులు ఆమెకు ఫోన్చేసి సమాచారం అందించారు. మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో వైద్యశాలలో చికిత్స చేయించినట్లు మృతురాలి సోదరి తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.