ప్రజాప్రతినిధులు, అధికారులు
పలు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు
నార్నూర్, జూన్11: పరిసరాల శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని గాదిగూడ మండల ప్రత్యేకాధికారి శివగణేశ్ అన్నారు. గాదిగూడ మండలంలోని దాబా (కే), దాబా(బీ)గ్రామాల్లో పారిశుధ్య పనులను శుక్రవారం పరిశీలించారు. వానకాలం ప్రారంభమైన నేపథ్యంలో అపరిశుభ్రత లోపించి, వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ముందు జాగ్రత్తగా పరిసరాల శుభ్రతపై దృష్టి సారించాల ని ఎంపీవో సాయిప్రసాద్కు సూచించారు. అపరిశుభ్రత లోపించిన ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చెల్లించాలని, చెత్తాచెదారం తొలగించాలన్నారు. వచ్చే నెల నాటికి మొక్కలు సిద్ధం చేయాలని సూచించారు. పల్లె ప్రకృతి వనం, ప్రధాన రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కల సంరక్షణ కు చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శి మార్ప సుభాష్, వెంకటేశ్ తదితరులున్నారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 11: పరిసరాలు శుభ్రంగా ఉం చుకోవాలని సర్పంచ్ కళావతి అన్నారు. మండలంలోని నర్సాపూర్(బీ) గ్రామ పంచాయతీలో మురుగు కాల్వల్లో పూడిక తీయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లి శానిటేషన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున ఇంటి పరిసరాలలో చెత్త చెదారం ఉండకుండా , నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జీపీ కార్మికులు పాల్గొన్నారు.
మత్తడిగూడ గ్రామంలో..
ఇంటి పరిసరాల్లో నీరు నిలువకుండా చూడాలని ఈవో సత్యనారాయణ అన్నారు. మండలంలోని మత్తడిగూడ గ్రామంలో నీరు నిల్వ ఉన్నచోట శుభ్రం చేసి బ్లీచింగ్ పౌ డర్ చల్లిటన్లు ఈవో పేర్కొన్నారు. అదే విధంగా పరిసరాల్లో సోడియం హైపోక్లోరైట్ స్ప్రే చేయించారు. వాటర్డే సందర్భంగా ఎవెన్యూ ప్లాంటేషన్ మొక్కలకు నీరు పోశారు. జీ పీ కార్మికులు, మడావి మోతీరాం పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూన్11: గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని ఎంపీవో సంతోష్ అన్నారు. మండలంలోని ఏమాయికుంట గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలను శుక్రవారం ఆయన సందర్శించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో మొక్కలకు నీరు పోసి హరితహారంపై అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్య పనులు చేపట్టి, ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. సర్పంచ్ జాదవ్ లఖన్ సింగ్, కార్యదర్శి విజయ్, రాందాస్, అశోక్ పాల్గొన్నారు.
నార్నూర్, జూన్11: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్ఈవో పవార్ రవీందర్ ప్రజలకు సూచించారు. గాదిగూడ మండలంలోని రుప్పాపూర్ గోండు గూడలో గాదిగూడ పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. స్థానికులు వైద్య పరీక్షలు నిర్వహించి,అవసరమైన మందులు పంపిణీ చేశారు. హెచ్ఏ బాపురావ్, ఆశ కార్యకర్త తురుసబాయి, అంగన్వాడీ టీచర్ మడావి కాశూబాయి ఉన్నారు.