న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పోటీ చేసే నియోజకవర్గంపై ఊహాగానాలకు తెరపడింది. యూపీలోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి ఆయన గురువారం నామినేషన్ వేస్తారని ఆ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించారు. సమాజ్వాదీ పార్టీకి ఎంతో పట్టున్న కన్నౌజ్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ మూడు సార్లు విజయం సాధించారు.
2012, 2014 ఎన్నికల్లో ఆయన భార్య డింపుల్ యాదవ్ గెలిచారు. అయితే 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి పాథక్ చేతిలో ఓటమి చవిచూశారు. కాగా, కొద్ది రోజుల క్రితం ఈ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ మేనల్లుడు, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడైన మాజీ ఎంపీ తేజ్ ప్రతాప్ యాదవ్ పోటీ చేస్తారని పార్టీ వర్గాలే ప్రకటించాయి. అయితే పార్టీ నేతల ఒత్తిడి మేరకు అఖిలేశే పోటీలో ఉండాలని నిర్ణయించారు.