ఘట్కేసర్/మేడ్చల్, ఫిబ్రవరి1: ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులు కల్పిస్తూ కేసీఆర్ సర్కారు విద్యారంగానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మన బస్తీ-మనబడి కార్యక్రమంలో భాగంగా బుధవారం మేడిపల్లి కమలానగర్లోని ప్రభుత్వ పాఠశాలలో రూ.24 లక్షల నిధులతో ఆధునీకరించిన పాఠశాల భవనాన్ని మేయర్ జక్క వెంకట్రెడ్డితో,అలాగే పోచారం మున్సిపాలిటీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను చైర్మన్ బి.కొండల్రెడ్డితో కలిసి మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం పాఠశాల తరగతి గదులను పరిశీలించిన మల్లారెడ్డి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘మన బస్తీ -మన బడి కార్యక్రమం దేశంలోని విద్యారంగానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని పేర్కొన్నారు.
మన ఊరు- మన బడిలో భాగంగా పలు పాఠశాలల్ల ఫర్నీచర్,తాగునీరు,మరుగుదొడ్లు,మూత్రశాలలు, విద్యు త్సౌకర్యం,పచ్చదనం,డిజిటల్ తరగతులు వంటి వాటిని ఏర్పాటు చేశామని అన్నారు. పోచారం మున్సిపాలిటీ లోని ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చాలని స్థానికులుమంత్రిని కోరారు.స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి పాఠశాల స్థాయి అప్గ్రేడ్కు కృషి చేస్తానని హమీ ఇచ్చారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ దయాకర్రెడ్డి, పీర్జాదిగూడ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్,కార్పొరేటర్లు హరిశంకర్రెడ్డి, నవీన్నెడ్డి, అనంతరెడ్డి, లక్ష్మీ ప్రసన్న శ్రీధర్రెడ్డి,మంజుల రవీందర్, సుభాష్, రమ్య సతీశ్గౌడ్, శారద ఈశ్వర్రెడ్డి, నాయకులు శ్రీధర్రెడ్డి, అంజిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, మహేశ్, జావిద్ఖాన్,అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య,పోచారం మున్సిపల్ కమిషనర్ సురేశ్,వైస్ చైర్మన్రెడ్డ్యా నాయక్,కౌన్సిలర్లు మహేశ్,మమతా రాణి,శైలజ,శ్రీలత,రాజశేఖర్, సాయిరెడ్డి,బాల్రెడ్డి,హరిప్రసాద్రావు,రవీందర్,కోఆష్షన్ సభ్యులు అక్రం అలీ,దాసరి శంకర్, పాఠశాల హెచ్ఎం రజిత,బీఆర్ఎస్ నాయకులు,విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.