Hyderabad | సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 28న సాయంత్రం 5గంటల నుంచి 30 సాయంత్రం 5గంటల వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని మూడు కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా ఓట్ల లెక్కింపు నేపథ్యంలో డిసెంబర్ 3న ఉదయం 6 గంట ల నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకు ట్రై కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. స్టార్ హోటల్స్, పబ్బులు, క్లబ్బుల్లో కూడా మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.