గాజులరామారం, మే 31: ప్రజా సమస్యల పరిష్కరించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీకి చెందిన సీనియర్ సిటీజన్స్ మంగళవారం ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చొరవతో తమ ఇండ్ల నిర్మాణానికి అనుమతి రావడంతో సీనియర్ సిటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను శాలువా కప్పి ఘనం గా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ స్థలాలు రిజిస్ట్రేషన్ అయినప్పటికీ వక్ఫ్ బోర్డు సమస్యతో ఇండ్ల నిర్మాణానికి అనుమతి లేక ఇబ్బందులు పడుతుండడంతో గతంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా అసెంబ్లీ వేదికగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. తమ స్థలాల్లో ఇండ్ల నిర్మాణానికి అనుమతి రావడంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, గోపాల్, పి.సత్యనారాయణ, బాల్రెడ్డి, పానకాలు, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
కుత్బుల్లాపూర్,మే31: జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని ఎంఎన్రెడ్డినగర్కి చెందిన ఆకుల రాములు అనారోగ్యంతో బాధపడుతూ ఓ దవాఖానలో చికిత్స పొంది సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నాడు. మంజూరైన రూ.3.50 లక్షల చెక్కును మంగళవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ బాధితుడి ఇంటి వద్దకు వెళ్లి అందించాడు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సిద్ధిరాములు, జ్ఞానేశ్వర్, మధుసూదర్రాజు, నరేందర్రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.
యువత స్వయం కృషితో ఎదగాలి…
యువత స్వయం కృషితో ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు. మంగళవారం సుచిత్రలో స్వాగత్గ్రాండ్లో ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మోటివేషనల్ స్పీకర్ బీఆర్ షపీబ్రద్ అధ్యక్షతన నిర్వహించిన బిజినెస్ డెవలప్మెంట్ట్రైనింగ్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హాజరై యువతకు సందేశాన్ని అందించారు.కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ జాలిగం రాకేశ్, ఎండడీ కిరణ్మయి, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.