ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి
12-14 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం
ఉత్తమ సేవలు అందించిన వైద్యులు, సిబ్బందికి సత్కారం
ఉప్పల్, మార్చి 16 : కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా నిర్మూలిం చడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని పలు పీహెచ్సీలలో 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ వ్యాక్సినేషన్ డే సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడుతున్నారని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 12 నుంచి 14 ఏండ్ల పిల్లలందరికీ టీకా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో టీం బీఎస్ఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు బేతి సుమంత్రెడ్డి, నేతలు గరిక సుధాకర్, కంకణాల శ్రీకాంత్రెడ్డి, జేసీబీ రాజు, దాచెపల్లి శ్రీధర్, హబ్సిగూడ డివిజన్ అధ్యక్షుడు డా.బీవీ చారి, ప్రధాన కార్యదర్శి కంచర్ల సోమిరెడ్డి, నందికంటి శివ, అక్బర్, యాదమ్మ, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ను ప్రారంభించి, కరోనా కష్టకాలంలో విధులు నిర్వర్తించిన వైద్యులు, సిబ్బందిని సత్కరించారు. వైద్యసిబ్బంది చేసిన సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో మస్క సుధాకర్, సత్యపాల్రెడ్డి, శ్రీకాంత్, ఐలేశ్, తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో..
మల్లాపూర్, మార్చి 16 : 12 నుంచి 14 సంవత్సరాల వయస్సు పిల్లలకు తప్పకుండా కరోనా టీకా వేయించాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి అన్నా రు. బుధవారం మల్లాపూర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ టీకా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన డాక్టర్ పూజ, ఏఎన్ఎం సరి త, లింగమ్మ, ఆశ, జ్యోతిలను సన్మానించారు.