ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి
చంపాపేట, ఏప్రిల్ 7: నియోజకవర్గం పరిధిలో నెలకొన్న ప్రధాన సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఆయన మార్నింగ్ వాక్లో భాగంగా చంపాపేట డివిజన్ పరిధిలోని మారుతీనగర్, దుర్గాభవానీ నగర్, సుల్తాన్ వాల్వా, చిలకల బస్తీల్లో పర్యటించి ఆయా కాలనీల, బస్తీల వాసులతో మాట్లాడారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు కాలనీల ప్రజలు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి, వినతి పత్రాలు ఇచ్చారు.
ఎమ్మెల్యే స్పందించి మాట్లాడుతూ, మారుతీనగర్లో వర్షాకాలంలో వస్తున్న ముంపు సమస్యకు, దుర్గాభవానీ నగర్లోని నాలాకు ఇరు వైపులా రోడ్డు ప్యాచ్ వర్క్, సుల్తాన్ వాల్వాలో అసంపూర్తిగా ఉన్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పునఃనిర్మాణం, చిలకల బస్తీలో రోడ్డు పునఃనిర్మాణాన్ని దశల వారీగా చేపట్టి, సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు కాలనీలు, బస్తీల వాసులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, చంపాపేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ముడుపు రాజ్కుమార్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్, నాయకులు రవి ముదిరాజ్, చేగోని మల్లేశ్ గౌడ్, మేక సురేందర్ రెడ్డి, బైగళ్ల రాము, సుధాకర్రెడ్డి, నిష్కాంత్రెడ్డి, రమేశ్ రెడ్డి, సరోజ, రమాదేవి, రజిని, లక్ష్మి, నాగమణి, కవిత తదితరులు పాల్గొన్నారు.