మెహిదీపట్నం: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న నెపంతో భర్తను ,ప్రియుడి సహకారంతో హత్య చేసిన భార్యను ,ఆమెప్రియుడిని హబీబ్నగర్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం….మల్లెపల్లి మాంగార్ బస్తీలో నివసించే రోషన్ను భార్య లత శనివారం కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయింది.
విచారణలో భాగంగా ఈమెకు స్థానికంగా నివసించే యువరాజ్తో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. వీరి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని యువరాజ్ సూచనలతో లత శనివారం మధ్యాహ్నం తన భర్త రోషన్ను కత్తితో పొడిచి చంపింది. సోమవారం వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.