మియాపూర్, మార్చి 16 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీలు విశేషంగా ఆకర్షిలవుతున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు క్యూ కడుతున్నారని, ఆయా పార్టీల కార్యాలయాలు ఖాళీ అవుతున్నాయన్నారు. వివేకానందనగర్ డివిజన్ వెంకటేశ్వరనగర్కు చెందిన బీజేపీ నాయకురాలు సురేఖ విప్ గాంధీ సమక్షంలో గురువారం బీఆర్ఎస్లో చేరింది. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా విప్ మాట్లాడుతూ.. రాజకీయాలు ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ తమ ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న కల్యాణలపక్ష్మి, దళితబంధు, కేసీఆర్ కిట్, కంటివెలుగు సహా ఎన్నో పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇతర రాష్ర్టాలలో ఈ పథకాల అమలుకు ప్రజల నుంచి డిమాండ్ వస్తుండటం సీఎం కేసీఆర్ దక్షతకు నిదర్శమన్నారు. పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ తగు గుర్తింపు ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ పటిష్టత కోసం పాటుపడే వారికి ఉత్తమ భవిష్యత్ ఉంటుందని విప్ గాంధీ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, సంజీవరెడ్డి, భాస్కర్రావు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన వారికి అత్యవసర వైద్య చికిత్సల నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.21,71,000 లక్షల ఆర్థిక సాయం నిధులను చెక్కుల రూపంలో విప్ గాంధీ గురువారం తన నివాసంలో లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఎంతో అండగా నిలుస్తున్నదన్నారు. పేదరికంతో అనారోగ్యాలతో బాధపడే వారికి ఈ పథకం ఆర్థిక సాయంతో కార్పొరేట్ వైద్యంతో స్వస్థతను పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు రఘునాథ్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, చంద్రకాంత్రావు, చంద్రారెడ్డి, చంద్రమోహన్సాగర్, విద్యాసాగర్, అష్రాఫ్, శివ పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి, మార్చి 16: దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం నలగండ్లలోని అవంతిక గోదావరి హోమ్స్ కాలనీలో ఆయన కాలనీవాసులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా చెరువు ప్రాంతంలో కడుతున్న మురుగునీటి పైపులైన్ల పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, కొత్తగా ఏర్పడిన కాలనీలో మంజీరా నీటి వసతి కల్పించాలని, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విన్నవించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వవిప్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రిప్రగడ సత్యనారాయణ, కాలనీవాసులు కిరణ్కుమార్, శ్రీహర్ష, సాయికృష్ణ, సంతోష్, నాగలక్ష్మీ, కీర్తివర్శ, సత్య, సాహిత్య, దివ్య తదితరులు పాల్గొన్నారు.