ఉప్పల్, జూన్ 7: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతుండగా ఆయన స్వరం వినిపించకుండా మైక్ కట్ చేశారు. శనివారం జరిగిన సీఎం రేవంత్రెడ్డి అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రజాప్రతినిధికి తన అభిప్రాయాలను ప్రజల ముందుంచే హక్కు ఉంది. అలాంటి వేదికపై రాజకీయ కక్షలు, వ్యక్తిగత విభేదాలు ప్రదర్శిస్తూ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పలువురు పేర్కొన్నారు.