మేడ్చల్, జనవరి12(నమస్తే తెలంగాణ) : కులవృత్తులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం కార్యక్రమంపై సందిగ్ధత నెలకొన్నది. ఒక్కొ యూనిట్కు లక్షా75 వేలు కాగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 80శాతం సబ్సిడీని అందించి మిగతా 20శాతం రూ.43,750 లను లబ్ధిదారుల నుంచి డీడీల రూపంలో తీసుకుని పంపిణీ చేసింది.
మూడవ విడతలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 900 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉన్నండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో డీడీలు కట్టిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.