వెంగళరావునగర్, నవంబర్ 21 : అంతా గులాబీమయం.. ఎటు చూసినా గులాబీ జెండా రెపరెపలే.. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రచారానికి మంగళవారం అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా మాగంటికి మద్దతుగా నిలిచి కదం తొక్కారు. రహ్మత్నగర్ డివిజన్ శ్రీరామ్నగర్ చౌరస్తాలో ప్రహ్లాద్ ఆధ్వర్యంలో రహ్మత్నగర్కు చెందిన యువకులు మాగంటి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 100 మంది యువకులకు గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. రాష్ర్టాభివృద్ధి, సమర్థవంతమైన పాలనను ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారని పేర్కొన్నారు. రాష్ర్టానికి నిజమైన సేవలందించే కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. గులాబీమయమైన ప్రాంతాలను చూస్తుంటే బీఆర్ఎస్ విజయానికి సంకేతమన్నారు. ఓటు హక్కును అందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, మంచి నాయకుడైన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు పట్టం కట్టాలని కోరారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, ఈ అభివృద్ధిని కొనసాగించేందుకు కారు గుర్తుకు ఓటెయ్యాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. నామా వినోద్, సయ్యద్ ఖాజా మొహిన్, సి.మధుసూదన్రావు, కోట్ల సతీశ్ పటేల్, బి.జగదీశ్, ఎన్.సంతోష్, జె.పి. రెడ్డి, సి.శివకుమార్, కోట్ల శ్రీకాంత్, సి.శ్రీకాంత్రావు, దాతు, శ్రీను, ఎం.ప్రవీణ్యాదవ్ మాగంటి సమక్షంలో కారెక్కారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ నాయకులు నజీర్, నాగరాజు, అరుణ్, రాకేశ్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.