కాచిగూడ : పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. కాచిగూడ డివిజన్లోని నింబోలిఅడ్డాకు చెందిన కె.కిషోర్గౌడ్ గత కొన్ని నెలలుగా ఆతని ఆరోగ్యం బాగలేకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లగా కిషోర్గౌడ్ ఆరోగ్యం కుదుటపడింది.
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీమాగౌని కృష్ణాగౌడ్ చొరవతో శుక్రవారం కిషోర్గౌడ్కు రూ.60 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా తెలంగాణను ఏడేండ్లలోనే అభివృద్ధి చేయడంతో సీఎం కేసీఆర్ పాలనపై యావత్ ప్రజానీకం నీరాజనం పలుకుతున్నారని ఆయన పేర్కొన్నారు.
పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పొరుగు రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బి.కృష్ణాగౌడ్, కిషోర్గౌడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.