ఘట్కేసర్ రూరల్, ఫిబ్రవరి 4 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నట్లు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. అవుషాపూర్ గ్రామంలోని టీఆర్ఎస్ మైనారిటీ యువజన విభాగం గ్రామ శాఖ అధ్యక్షుడిగా సయ్యద్ కరీంను ఎంపీపీ , సర్పంచ్ కావేరి మచ్చేందర్ రెడ్డి నియమించారు. కార్యక్రమంలో మైనారిటీ విభాగం నాయకులు మగ్దుం, షౌకత్, మదర్, జాహంగీర్, అజ్మత్, రఫీజ్, సమీర్, హబీద్, నజీర్, ఇమామ్, గ్రామ శాఖ టీఆర్ఎస్ అధ్యక్షుడు సాయిలు పాల్గొన్నారు.